Tuesday 25 October 2011

తిక్కన సోమయాజి


"కవి బ్రహ్మ" ,'ఉభయకవిమిత్రుడు" అనే బిరుదులు గల తిక్కన క్రీ.శ.1210-1290 మధ్య కాలంలో జీవించాడని చరిత్రకారులు నిర్ణయించారు .అంటే 13 వ శతాబ్దికి చెందినవాడు.తిక్కన తాత "భాస్కరుడు".మనుమసిద్ధి ఆస్థానకవిగా ప్రసిద్ధుడైన తిక్కన యజ్ఞం చేయటం వల్ల "సోమయాజి"గా పేరొందాడు.మనుమసిధ్హికి మంత్రిగా కూదా తిక్కన పనిచేశాడు.తిక్కన శిష్యుడైన "మూలఘటిక కేతన" రాసిన "దశకుమార చరిత్ర"లో తిక్కనకు సంబంధించిన వివరాలున్నాయి. తిక్కన ఇంటి పేరు "కొట్టరువు".తండ్రిపేరు "కొమ్మన దండనాథుడు".
తిక్కన "నిర్వచనోత్తర రామాయణం', "అంధ్ర మహాభారతం" రచించాడు. పదిహేను పర్వాలను ఒక్క చేతిమీదుగా రచించిన ప్రతిభాశాలి తిక్కన.అంధ్ర మహాభారతాన్ని "హరిహరనాథుడి"కి అంకితమిచ్చాడు.
అంధ్ర మహాభారతం,నిర్వచనోత్తర రామాయణం కాకుండా తిక్కన "విజయసేనం,"కవిసార్వభౌమచ్ఛందస్సు" ,"కృష్ణశతకం"  కూడా రచించినట్లు చెప్తారు."విజయసేనం" లోని కొన్ని పద్యాలు మాత్రమే లభ్యమవుతున్నాయి.మిగిలిన రచనలు దొరకలేదు.తిక్కన తన భారతాన్ని నరాంకితం చేయడానికి  ఇష్టపడలేదు.హరిహరనాథుడే  తనను అడిగి   కృతి పొందాడని చెప్పే ఈ పద్యంలో తిక్కన అంధ్రాభిమానం వ్యక్తమవుతుంది. 
"తెనుగుబాస వినిర్మింప దివురుటరయ
భవ్యపురుషార్థ తరుపక్వ ఫలముగాదె
దీనికెడ   నియ్యకొని వేడ్కనూనికృతి  ప
తిత్వమర్థించి వచ్చితి తిక్కశర్మ "
తిక్కన నన్నయ్యను తన గురువువలె భావించాడు."విద్యాదయితుడు"గా "మహితాత్ము"నిగా ప్రశంసించినా  తనదైన కవితా పంథా ఉండాలని భావించాడు.
తిక్కన ఆంధ్రాభిమానం చాలా గొప్పది.నన్నయ్య సంస్కృత  పదాలను ఎక్కువగా వాడాడు.ఆ రోజుల్లో సంస్కృఇతానికి  తప్ప తెలుగుకు ఆదరణ లేదు. తెలుగు భాషకి గౌరవం,ఆదరణ కల్పించడం కోసం తిక్కన ఈ విధంగా శపథం చేసాడు. 

"ఔత్యము గామి నొప్పయిన సంస్కృఈతమెయ్యడ  జొంప వాక్యాసాం
గత్యము సేనబోనయిన గద్యముతోదుగ జెప్పి పెట్ట దౌ
ర్గత్యముదోప బ్రాసముప్రకారము వేఱగు
నక్షరంబులన్
శ్రుత్యను రూపమంచునిడ నూరుల  కివ్విధమింపు బెంపదే "   
కొందరుకవులు  వాడిన మాటల్నే  వాడుతూ అది తమ నేర్పుగా చెబుతూ ఉంటారు .అటువంటి రచన నిరర్ద్ధకమంటూ   తిక్కన నిష్కర్షగా,కొంచెం  కోపంగా ప్రకటించాడు.
తిక్కన మహాభారతం అనువాదంలా కాకుండా స్వతంత్ర కావ్యంలా భాసిస్తుంది.తెలుగుదనం ఉట్టిపడుతుంది.దానికి కారణం తిక్కన ఆంధ్రాభిమానం.తెలుగు భాషకి గౌరవం కల్పించి,భారతంలోని  పాత్రలను  తెలుగువారికి  సన్నిహితం చేసి అసలైన  తెలుగుభారతాన్ని అందించాడు.
"తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి"అని తెలుగు వారు అనడానికి ముఖ్య కారణం తిక్కన  శైలే .తిక్కన కాక మరెవరు  రాసి ఉండినా తెలుగు వారికి మహాభారతం ఇంత ప్రీతిపాత్రం అయిఉండేదికాదని అనడంలో తప్పులేదు. 

  

No comments:

Post a Comment